ప్రతి మనిషి గౌరవాన్ని గౌరవించి కాపాడాలి: పోప్
జోసెఫ్ అవినాష్
09 Sep 2026
సెప్టెంబర్ 9, 2026న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో XIV,రెండవ వాటికన్ కౌన్సిల్కు చెందిన ‘గౌదియం ఎట్ స్పెస్’ బోధనలను ప్రస్తావిస్తూ ప్రతి మనిషికి ఉన్న అంతర్గత గౌరవం గురించి వివరించారు.ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలో సృష్టించబడినందున,అతని గౌరవం సంపద, సామాజిక స్థానం,సామర్థ్యం లేదా విజయాలపై ఆధారపడదని ఆయన అన్నారు.మనిషి తనను తాను ఇతరుల నుండి వేరుగా కాకుండా,పరస్పర ప్రేమ,సహకారం,సేవ మరియు త్యాగం ద్వారా సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.శరీరం మరియు ఆత్మ కలిసి ఒకే మానవ వ్యక్తిని ఏర్పరుస్తాయని,అందువల్ల మానవ శరీరాన్ని కేవలం ఉపయోగించుకునే వస్తువుగా చూడకూడదని పోప్ గుర్తుచేశారు.అలాగే బుద్ధి,మనస్సాక్షి,స్వేచ్ఛ వంటి దేవుని వరాలను సత్యాన్ని అన్వేషించడానికి,మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి బాధ్యతతో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.పాపం మరియు బలహీనతల మధ్య కూడా క్రీస్తు మనిషిని అంతర్గతంగా విముక్తి చేసి పునరుద్ధరించడానికి వచ్చాడని చెబుతూ,ప్రతి మనిషి యొక్క చెరగని గౌరవాన్ని గుర్తించి,దానిని గౌరవిస్తూ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.
