విశ్వ రాజ్జి - మరియతల్లి - నిర్వచనం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

22 Aug 2026

మరియమాత విశ్వగ్లోబు మీద నిల్చొని ఉండటంకొన్ని చిత్రపటాలలో గమనించవచ్చు.ఆమె పాదముల కింద ఒక సర్పం ఉంటుంది.దాని తలను ఆమె త్రొక్కినట్లుండే ఈ చిహ్నం ఆదికాండంలోని సంఘటనను గుర్తు చేస్తుంది... "ఆమె సంతతి వారు నీ తలను చితక గొట్టుదురు" (ఆది 3:15). ఆమె పరలోక భూలోక రాజ్ఞీగా ప్రకటించబడింది.అది ఆమె ఔన్నత్యానికి దేవుడు ఆమెకిచ్చిన గౌరవానికి ప్రతీక. ఆమె తలచుట్టూ ఉన్న పన్నెండు నక్షతాలు,పన్నెండు అపోస్తులులను సూచిస్తాయి. ఈ పన్నెండు ఆపోస్తులు ప్రపంచ నలుమూలలా వ్యాపించిన తిరుసభకు ప్రతినిధులు,ఈ సంజ్ఞలు దర్శన గ్రంథంలో వివరించబడినట్లు గమనించాలి: "అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను.ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను.సూర్యుడే ఆమె వస్త్రములు,చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను.ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను" (దర్శన 12:1) సూర్యచంద్రుల ప్రస్తావన పగలు రాత్రికి సంకేతము. ఈ చిహ్నాలు ఆమె తన పవిత్రతతో ఈ లోకంలో సాధించిన ఘనతను,దైవానుగ్రహముతో పొందిన అత్యున్నత స్థానాన్ని గుర్తుచేస్తున్నాయి.ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవుడు ఆమెతోనున్నాడని గాబ్రియేలు సన్మనస్కుడు సెలవిచ్చాడు (లూకా 1:28) ఆమె తల మీది కిరీటం ఆమె విశ్వరాజ్ఞ అన్న సూచనను తెలియజేస్తుంది. 1954లో 12వ భక్తినాధ పాపుగారు ఆమెను పరలోక రాజ్ఞీగా అభివర్ణించారు. తాము చెప్పే జపమాలలో దేవరహస్యాన్ని ధ్యానించడం కతోలికుల భక్తి మార్గాలలో ఒకటి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN