నేటి పునీతులు: పునీత బెర్నార్డు
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
20 Aug 2026
పునీత బెర్నార్డు ఫ్రాన్సుదేశంలో బర్గండి రాష్ట్రం తేజోన్ గ్రామంలో పొంటెయిన్సు భవనంలో క్రీ.శ. 1090లో పుట్టారు. తండ్రి తెలివి సోర్రెల్. తల్లి అతెల్. గొప్పవంశం. ధనికులు, వీరి ఏడుగురు సంతానంలో బెర్నారు మూడవారు. వీరిని తల్లి ఎంతో భయభక్తులతో పెంచింది. బెర్నార్డు మంచి చదువరి, ప్రజ్ఞాశాలి, ఆలోచనాపరుడు, ఆచితూచి అడుగువేసే మనిషి. విరక్తత్వ ప్రియుడు. న్యాయశాస్త్ర విద్య నిమిత్తం సియోనెలోని కేటిల్లాను పట్టణంకు పంపబడినారు. వీరు సైనిక శిక్షణ కూడా పొందినట్లు చెప్పబడింది. బెర్నార్డు క్రీ.శ. 112లో తమ ప్రియమైన తల్లిని కోల్పోయారు.
అప్పటికి దారి వయస్సు 22 సం.లు ఆ సమయంలో వారి మస్తిష్కంలో విరక్తిభావాలు ముప్పిరిగొన్నాయి. దైవ పిలుపు ఘోష అధికరించింది. లోకాశలు, పదవులను చిరసించారు. ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు సేవలో తరింప సన్యసించారు. ఎంతో ప్రోత్సహించి మరో 31 మందిని సన్యసింపజేసి ఒక జట్టుగా కూడగట్టారు. వీరిలో వరి వితంతుతండ్రి, ఒక బాబాయి, నల్గురు సోదరులు ఉండటం విశేషం. ఈ రన్యాసుల బృందం క్రీ.శ. 1112లోనే సిటియుకు నగరంకు చేరుకున్నారు. అక్కడ క్రీ.శ. 1568లో 'పునీత బెనెడికు కఠినతర నియమావతి నమసగించి ఊరింపబడిన.
బెర్నార్డులోని పవిత్రత దైవ మానవ ప్రేమ, భక్తి, సాధుత్వం, చురుకుదనం, మాటాడే విధానం, ప్రబోధించేతీరు వీరి క్రీస్తు సందేశాన్ని విని ఒక రాజుకుమారుడు కూడ తన్నుతాను త్యజించుకుని వీరి మఠ సభ్యుడు కావడం విశేషంగా చెప్పుకోబడింది. ఈ ఖ్యాతితో బెర్నార్డు యూరపు అంతటా కలియ దిరిగి సువార్తనందించారు. జర్మనీ, స్వీడను, ఐర్లాండు, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండు వంటి దేశాల్లో 136 ప్రదేశాల్లో వీరు తమ సిస్టెర్షియన్ మఠాన్ని నెలకొల్పారు. ప్రజల్లో శాంతి సమైఖ్యతలకై కృషి చేశారు. ఆ రోజుల్లో అబెలార్డ్ అను నాస్తిక వాది అసత్య ప్రచారాన్ని దైవ వ్యతిరేకతని సమర్థంగా తిప్పికొట్టారు.
క్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు చేసిన అద్భుత క్రియల్ని సాక్ష్యాలుగా నిరూపించారు. వీరు వ్రాసిన గ్రంథాల్లో దే డిలిజెండో దేయో మరియు దె కన్సిడరేషన్స్ అనేవి ముఖ్యమైనవి. మొదటిది వేదాంతపరమైనది. మానవాత్మలపట్ల దేవుడు కనబపరచిన ఆశ్చర్యకర కార్యాన్ని వక్కాణించారు. తమ నిజ జీవితంలో దేవుడు కురిపించిన కృపావరoగూర్చి స్వీయ అనుభవాన్ని అందు వివరించారు. ఇక రెండవ పుస్తకం ఆధ్యాత్మిక పరమైనది. శ్రీసభలో వ్యక్తిగత పవిత్రత ఆవశ్యకత గూర్చి తొలి ప్రాధాన్యతగా పేర్కొని, మిగతా భౌతిక అవసరాలు రెండవ ప్రాధాన్యతగా మాత్రమేనని పేర్కొన్నారు. శ్రీసభపట్ల సమాజంపట్ల బెర్నార్డు గారి అవగాహన అమోఘం. అందుకే జగద్గురువులు, పీఠాధిపతులు, రాజ్యాధినేతలు బెర్నార్డును కలసి వివిధ సమస్యలకు పరిష్కారాలు విధి విధానాలపై అడిగి సలహాలు గైకొనేవారు.
వీరి సూచనలు బలమైన క్రైస్తవ సిద్ధాంతాలపై ఆధారపడి విశ్వజనీనమైనవిగా ఉండేవి. అన్ని కాలాలకు అందరికి వర్తించేలా ఉండేవి. క్రీ.శ. 1130లో కొత్త జగద్గురువుల ఎన్నికలో ఏర్పడిన జగడంలో బెర్నార్డు 2వ ఇన్నోసెంటు పక్షం వహించి 2వ అనళ్లేటపు ఎన్నిక సమర్థనీయం కాదన్నారు. 12వ శతాబ్దంలో దక్షిణ ఫ్రాన్సులో పెచ్చరిల్లిన దబ్బరసిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో కార్డినల్ అల్బరిక్ సూచనల మేరకు బెర్నార్డు ల్యాంగుడక్ ప్రాంతంలో విస్తారంగా ప్రబోధించి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడకలిగారు.
క్రీ.శ. 1145లో 3వ యూజిను పోపుగారు శ్రీసభపాలనా పగ్గాలు చేపట్టారు. ఆరునూ బెర్నార్డుకు చెందిన సిస్టెర్షియన్ గురువుల సభకు చెంది మఠాధిపతిగా పనిచేసేవారు. ఆ చొరవతో వారు బెర్నార్డును ఫ్రాన్సు మరియు జర్మనీ దేశాల్లో రెండవ మతోద్యమం నడపాల్సిందిగా ఆజ్ఞాపించారు.ఇందుకు అనేపథ్యం ఏమనగా క్రీ.శ. 1144లో ఎడెస్సా రాజ్యపతనంలో జెరుసలేము, అంతియోకు క్రైస్తవ ప్రజల్లో భయం, అభద్రతా భావం నెలకొన్న విశ్వాసం పరీక్షకు గురైంది. అందువల్ల ఈ రెండవ మతోధ్యమం అవసరమైన ఈ పవిత్రకార్యాన్ని బెర్నార్డ్ దిగ్విజయంగా నిర్వహించారు. క్రీస్తు శ్రమల విషయ వీరి విశ్లేషనా ప్రసంగాలు విని జర్మనీ చక్రవర్తి 3వ కాన్వడ్ మరియు ఆయన
సోదరు పుత్రుడు చార్బరోసా కన్నీటి
పర్యంతమయ్యారు. ఇలా వీరి సందేశాలు
యూరపన ఊర్రూత లూగించాయి.
సాధారణ జన జీవితం స్థంభించింది. పురుషులు సిలువ స్వరూపం భుజంకెత్తుకుని గ్రామ గ్రామాన సిలువమార్గం, ప్రార్థనలు జరుగుతుంటే మహిళలూ అందుకు సహకరింపగా ప్రజల్లో మనో పరివర్తనలు పెరిగి పాపోవచ్చరణం, పవిత్ర జీవితంకు నడుం బిగించారు, ఆ దినాల్లో సంభవించిన ఆశ్చర్యకర సంఘటనలు, అద్భుత స్వస్థతలు మనసు మార్పులు, చిక్కుల పరిష్కారాలకు లెక్కలేదు. మతోద్యమం మూడు పూవ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.
ఇంత జరిగినా మహా కార్యక్రమంలో అపశృతులు దొర్లకపోలేదు. కొందరు మూర్ఖుల్లో బయల్పడిన క్రమ శిక్షణా రాహిత్యం, ప్రజా గుంపులన్నింటిపై మితి మీరిన గుడ్డి నమ్మకం వంటివి కొందరు కుట్రదారులు రాజద్రోహంకు తలపడటానికి కారణభూతమైంది. ఈ గందరగోళం అంతటికి బెర్నార్డుగారే బలిపశువు కావాల్సివచ్చింది. అపనిందలకు విమర్శలతో మనో వేదనకు గురి కావాల్సివచ్చింది.
మానవ రక్షణోద్యమంలో
అపూర్వత్యాగమయిగా నిలచిన పరిశుద్ధ దేవమాత పట్ల బెర్నార్డు గారికి యెనలేని మర్యాద భక్తి. ఇందుకు తార్కాణం వారు హృద్యంగా రచించిన డాక్టర్ మెల్లి పూస్ అనే పుస్తకమే. వీరు అనేక విశ్వాస ప్రార్థనలు, మరియమాతను వేడుకొను జపాలు కూడా లిఖించారు. వీరు అద్భుతంగా వ్రాసిన "దేవమాత శరణుకోరు జపము మిక్కిలి నెనరుగల తల్లీ మీ శరణు పరుగెత్తివచ్చి..." అను ప్రార్థన శ్రీసభలో ప్రసిద్ధమైనది. వీరు తమ వృద్యాప్యంలో తమ 63వ ఏట క్లెయిర్ వాక్సులోని తన మఠనిలయంలో పూర్తి సంసిద్ధతతో శ్రీసభ పండితునిగా ప్రకటింపబడినారు. బెర్నా అంటే ఎలుగుబంటివలె మిక్కిలి సాహసి అని అర్థం.
