చీకటి క్షణాల్లోనూ క్రీస్తు మనలను విడిచిపెట్టడు: పోప్
జోసెఫ్ అవినాష్
10 Aug 2026
ఆదివారం విశ్వ కాపరి పోప్ లియో XIV పునీత పేతురు మహాదేవాలయ ఆవరణలో సమావేశమైన విశ్వాసులతో సువిశేష సందేశాన్ని పంచుకున్నారు,తుఫానులో భయపడుతున్న శిష్యుల వద్దకు యేసుక్రీస్తు నీటిపై నడుచుకుంటూ వచ్చిన సువిశేష సందర్భాన్ని ధ్యానించారు.జీవితంలో ఎన్ని కష్టాలు,భయాలు ఎదురైనా యేసు మనలను విడిచిపెట్టడని,మన చూపును ఆయనపైనే నిలిపి విశ్వాసంతో ముందుకు సాగాలని పోప్ పిలుపునిచ్చారు.ప్రార్థన,దేవుని వాక్యం, దివ్య సంస్కారాల ద్వారా క్రీస్తు సన్నిధిని మన జీవితంలో ఆహ్వానించినప్పుడు ఆయన మనకు శాంతి,వెలుగు,బలాన్ని ప్రసాదిస్తారని ఆయన అన్నారు.
