బాప్తిస్మ రికార్డు వివాదం: బిషప్పై కేసు కొట్టివేసిన హైకోర్టు

జోసెఫ్ అవినాష్
31 Jul 2026
తమిళనాడులోని కుంభకోణం అగ్ర పీఠానికి చెందిన పీఠాధిపతి పై జ్ఞానస్నాన ధ్రువపత్రాన్ని నకిలీ చేశారన్న ఆరోపణలను మద్రాస్ హైకోర్టు జూలై 28న కొట్టివేసింది.చిన్ననాట కుటుంబం పెట్టిన పేరు,బాప్తిస్మ సమయంలో చర్చి నమోదు చేసిన పేరు వేర్వేరుగా ఉండటం సహజమేనని,ఆ పేర్లను ఒకే వ్యక్తికి చెందినవిగా సవరించడం నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.అందువల్ల బిషప్పై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.ఈ తీర్పు చర్చి బాప్తిస్మ రికార్డుల చట్టబద్ధతకు, వాటి విశ్వసనీయతకు బలమైన మద్దతుగా నిలిచింది.
