దేవుని రాజ్యమే మన జీవితానికి నిజమైన సంపద –పోప్
జోసెఫ్ అవినాష్
27 Jul 2026
జూలై 26న కాస్టెల్ గాండోల్ఫోలో జరిగిన ఏంజెలస్ ప్రార్థనలో విశ్వ కాపరి పోప్ లియో XIV,మనిషి జీవితంలో అత్యంత విలువైన నిధి ఏమిటో ఆలోచించమని పిలుపునిచ్చారు.ఈ లోకం అందించే ధనం,వస్తువులు,సౌకర్యాలు తాత్కాలికమైనవేనని,కానీ దేవుని రాజ్యాన్ని పొందినవాడు నిజమైన ఆనందం,శాంతి,జీవిత పరిపూర్ణతను అనుభవిస్తాడని తెలిపారు.క్రీస్తును అనుసరించడం త్యాగంలా కనిపించినా,అది మనిషికి లభించే గొప్ప వరమని గుర్తుచేశారు.ప్రతి విశ్వాసి తన జీవితంలో దేవునికే మొదటి స్థానం ఇచ్చి,సువార్త విలువలను ఆచరిస్తూ జీవించినప్పుడే నిజమైన సంపదను పొందగలడని పోప్ సందేశమిచ్చారు.
