కుల వివక్షపై న్యాయం గెలిచింది: దళిత క్రైస్తవుల ఖననానికి హైకోర్టు మార్గం

జోసెఫ్ అవినాష్
22 Jul 2026
భారతదేశంలోని దళిత క్రైస్తవుల సమాన హక్కుల పోరాటంలో తమిళనాడులో ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది.దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలుకుతూ,మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక దళిత కతోలిక విశ్వాసిని సాధారణ కతోలికుల సమాధి స్థలంలోనే ఖననం చేశారు.ఈ సంఘటనను శ్రీసభ నాయకులు,సామాజిక కార్యకర్తలు చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ,కుల వివక్షకు వ్యతిరేకంగా న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.ఈ తీర్పు దళిత క్రైస్తవులకు గౌరవప్రదమైన అంత్యక్రియల హక్కును బలపరచడమే కాకుండా,శ్రీసభలో సమానత్వం,సోదరభావం మరింత బలపడేందుకు ఆశాజ్యోతి వెలిగించిందని వారు అభిప్రాయపడ్డారు.
