కడప పీఠములో ఇంటింటా భారతమిత్రం

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
06 Jul 2026
తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి సౌజన్యముతో నడిపించబడుతున్న ఏకైక అధికారిక పక్షపత్రిక భారతమిత్రం. "ఇంటింటా భారతమిత్రం" ప్రచార కార్యక్రమంలో భాగంగా పత్రిక ఎడిటర్ ఫాదర్ చల్ల డేవిడ్ గారు జులై 5న కడప పీఠం, సెయింట్ మేరీస్ కథడ్రాల్ లో విచారణ గురువులైన ఫాదర్ ఈలి లూర్థు మరియన్న గారి ఆధ్వర్యంలో దివ్యబలిపూజను సమర్పించి,శ్రీసభ సువార్త పరిచర్యలో భారతమిత్రం అందిస్తున్న విశిష్టమైన సేవలను గురించి తెలియపరచగా, పలువురు విశ్వాసులు, యువత పత్రికను స్వీకరించి,భారతమిత్రం పత్రిక పట్ల తమ ప్రేమను వ్యక్తపరుస్తూ,చిరు కానుకలు సమర్పించారు.
