మధ్యప్రాచ్య క్రైస్తవులను మరువొద్దు – పోప్
జోసెఫ్ అవినాష్
18 Jun 2026
తూర్పు దేశ కతోలిక సంఘాలకు సేవలందిస్తున్న ROACO సంస్థ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన పోప్ లియో XIV, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధాలు,అస్థిరత, హింసల వల్ల అక్కడి క్రైస్తవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తమ స్వదేశాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిలిచిన తూర్పు సంఘాల ధైర్యం మొత్తం శ్రీసభకు స్ఫూర్తిదాయకమని అన్నారు.అలాగే,శాంతి స్థాపన కోసం ప్రార్థనతో పాటు సంఘీభావం,సహాయం, మానవతా సేవలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.శ్రీసభ ఎప్పటికీ బాధపడుతున్న ప్రజల పక్షాన నిలుస్తుందని, మధ్యప్రాచ్య దేశాలకు శాంతి అత్యవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
