ఆదివారం దేవునికా? ట్యూషన్కా? శ్రీలంకలో చర్చ

16 Jun 2026
పరీక్షల ఒత్తిడి,అదనపు చదువుల కారణంగా చాలామంది పిల్లలు తమ మతబోధన తరగతులకు దూరమవుతున్నారని శ్రీలంకలో ఆందోళన వ్యక్తమవుతోంది.పిల్లలు విద్యతో పాటు నైతిక విలువలు,విశ్వాసం,మంచి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవాలంటే ఆదివారాల్లో మతపాఠాలకు తగిన సమయం దొరకాలని మత ప్రతినిధులు,పెద్దలు,తల్లిదండ్రులు కోరుతున్నారు.అందుకే ఆ రోజున కొంతసేపు అదనపు తరగతులకు విరామం ఇచ్చి,పిల్లలకు ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశాన్ని కల్పించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
