నిరుపేదల సేవలో తమిళనాడు పీఠాధిపతులు

జోసెఫ్ అవినాష్
13 Jun 2026
తమిళనాడులో అత్యంత పేదరికంలో,శిథిలమైన గుడిసెల్లో జీవిస్తున్న దళిత,గిరిజన కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో తమిళనాడు కతోలిక పీఠాధిపతులు సమాఖ్య 60 ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ప్రతి కుటుంబానికి సురక్షితమైన నివాసం కల్పించడం ద్వారా వారి జీవితాల్లో ఆశ,భద్రత,ఆత్మగౌరవాన్ని నింపాలని ఈ ప్రయత్నం ఉద్దేశిస్తోంది.ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తవగా,మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.“సమాజంలో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడం” అనే సువార్త సందేశాన్ని ఆచరణలో చూపించే సేవగా ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతుల సమాఖ్య అభివర్ణించింది.
