ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధత వైపు పయనించాలి - పోప్
జోసెఫ్ అవినాష్
21 May 2026
పరిశుద్ధ జీవితం కొద్దిమందికే చెందినది కాదని, దేవునిని నమ్మి జీవించే ప్రతి క్రైస్తవుడూ పవిత్రత వైపు నడవాలని జనరల్ ఆడియన్స్ సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలో భయం,యుద్ధాలు,కష్టాలు పెరుగుతున్నప్పటికీ క్రీస్తుపై ఆశ కోల్పోవద్దని చెప్పారు.ప్రేమ, క్షమ,దయ,సేవల ద్వారా దేవుని సాక్షులుగా జీవించాలనే పిలుపునిచ్చారు.బాధల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా ఆదరిస్తూ, “దేవుడు ఎప్పుడూ తన ప్రజలను విడిచిపెట్టడు” అని ధైర్యం చెప్పారు.మరియతల్లి లాగా దేవుని చిత్తానికి విధేయులై విశ్వాసంలో నిలకడగా ఉండాలని విశ్వాసులను ప్రోత్సహించారు.
