ప్రపంచ శాంతికి హృదయ మార్పు అవసరం -పోప్ పిలుపు
జోసెఫ్ అవినాష్
12 Apr 2026
వాటికన్ వేదికగా శనివారం ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేక జాగరణ ఆరాధన కార్యక్రమం జరిగింది. విశ్వ కాపరి పోప్ లియో XIV అధ్యక్షతన ఈ ఆరాధన జరిగింది.ఆయన మాట్లాడుతూ,మనుషుల హృదయాలలో మార్పు లేకుండా నిజమైన శాంతి సాధ్యం కాదని తెలిపారు.యుద్ధాలు, హింసతో బాధపడుతున్న ప్రపంచాన్ని చూసి,ప్రతి వ్యక్తి ప్రేమ, క్షమ,దయతో జీవించాలనే ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు.బాధలో ఉన్నవారి కోసం ప్రార్థిస్తూ,దేవుని కరుణ ద్వారానే శాంతి కలుగుతుందని విశ్వాసులకు పిలుపునిచ్చారు.
