ప్రతి విశ్వాసి – క్రీస్తుకు జీవసాక్షి
జోసెఫ్ అవినాష్
19 Mar 2026
బుధవారం,జనరల్ ఆడియన్స్ సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV రెండవ వాటికన్ మహాసభ బోధనలను గుర్తు చేస్తూ,ముఖ్యంగా lumen gentium పత్రంపై తన సందేశాన్ని వినిపించారు.ఈ పత్రం ప్రకారం జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి క్రైస్తవ విశ్వాసి సత్య సువార్తకు సాక్షులుగా నిలబడి,నవ్య సువార్తికరణకై నడుం బిగించాలని బోధిస్తున్నదని ఆయన తెలిపారు.సువార్త ప్రకటన అనునది కేవలం గురువులకు మాత్రమే కాక ప్రతి విశ్వాసికి వర్తిస్తుందని ఆయన తెలిపారు.మన మాటలు,పనులు,ప్రవర్తన అన్ని కలగలిపి సువార్తను ప్రకటించాలని,అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులమవుతామని ఆయన స్పష్టం చేశారు.
