తెలుగు పీఠాధిపతుల మండలి సర్వసభ్య సమావేశాలు ప్రారంభం

జోసెఫ్ అవినాష్
06 Mar 2026
ప్రతి ఏడాది మార్చి నెలలో జరుగు తెలుగు పీఠాధిపతులు మండలి సర్వసభ్య సమావేశాల ఈ వార్షిక సంవత్సరానికి గాను,హైదరాబాదు పునీత యోహాను గురువిద్యాలయం,రామంతపూర్ నందు మార్చి 4న ప్రారంభమయ్యాయి.ఈ నెల 6వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి.ఈ సర్వసభ్య సమావేశాల్లో పీఠాధిపతుల మండలి వివిధ విభాగాలకు,సంచాలకులుగా,కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గురువులు సేవా విభాగాల వార్షిక నివేదిక సమర్పించటంతో పాటు,ప్రాంతీయ విభాగాల పరిచర్యల పై సమీక్ష జరిపి ,పీఠాధిపతులు తగిన సూచనలు ఇవ్వటం జరుగుతుంది.
