పాప సంకీర్తనానికి బైబిలులో ఆధారాలున్నాయా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

18 Feb 2026

అవును ఉన్నాయి.పూర్వ నిబంధనలోని లేవీయకాండం ఈ విధంగా చెబుతోంది: "పాప పరిహారబలిగా ఒక పొట్టేలిని సమావేశపు గుడార ప్రవేశద్వారము వద్దకు కొనిరావలయును.యాజకుడు ఆ పొట్టేలును బలి ఇచ్చి అతని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును.ప్రభువు అతని తప్పిదములను మన్నించును" (లేవీయ 19:21).ఇక్కడ యాజకుడు పాపి ‌తప్పిదము తెలుసుకోకపోతే ప్రాయశ్చిత్తము చేయలేడు కదా! ఈ విధంగా పాప పరిహారంలో మానవ మధ్యవర్తిత్వము పూర్వనిబంధన నుండే ప్రారంభమయింది.నూతన నిబంధనలో అది స్పష్టతను సంతరించుకుంది.ఈ వాక్యం గమనించండి: "పై పాపములలో దేనినైనా కట్టుకొనినవాడు.తన దోషమును అంగీకరింపవలయును.. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపము నుండి విముక్తుడగును" (లేవీయ (5:5-6) భప్తిస్టు యోహాను వద్ద ప్రజలు తమ పాపములను ఒప్పుకొనుచూ,బాప్తీస్మము పొందారని మత్తయి వివరించాడు (మత్తయి 3:6). "ప్రజలు తమ పాపములు ఒప్పుకొనుచు..." అంటూ మార్కు కూడా ప్రస్తావిస్తాడు. (మార్కు 1:5). బప్తిస్మ యోహాను ప్రజల పాపాలను విన్నాడు గనుకనే "ఇదిగో! లోకపాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల" అంటూ ప్రజలకు యేసుక్రీస్తును చూపగలిగాడు (యోహాను 1:29) పాపపరిహారానికి ఇక్కడ మానవ మధ్యవర్తిత్వం ఆమోదించినట్లయింది.ఆ తరువాత క్రీస్తుప్రభువు స్పష్టమైన అధికారాన్ని తన శిష్యులకిచ్చాడు.తమకు పాపములు క్షమించే అధికారమున్నదని తెలియజేశాడు (మత్తయి 9:6-8) ఈ శక్తిని క్రీస్తు తన శిష్యులకిచ్చినట్లు యోహాను వివరిస్తాడు. "ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును... వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును" అని చెప్పిన ప్రభువు పాపక్షమాపణను కూడా వారికి అధికారపూర్వకంగా ఇచ్చాడు (మత్తయి 18:18). "మీరు పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు" అని బోధించిన యాకోబు, పాపక్షమాపణలో మానవ మధ్యవర్తిత్వాన్ని సమర్ధించి అందులో స్వస్థత దాగుందని కూడా వివరించాడు (యాకోబు 5:16).

మొదటి క్రీస్తు సంఘంలో,ప్రతి క్రీస్తు సంఘమునందును పెద్దలు నియమింపబడి, సంఘస్తుల ఆధ్యాత్మిక అవసరములు తీర్చే వారని అపోస్తులకార్యం తెలియజేస్తుంది (అ.కా. 14:23; 15:2) పౌలుని మాటలలో "ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని, ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషితకార్యమును మాపై పెట్టెను" (2 కొరింతీ 5:18). కాబట్టి బైబిలులో దేవుడు మానవుల పాపాలను క్షమించే దయామయుడని, క్రీస్తు దేవునికి మానవునికీ మధ్యవర్తిగా ఉన్నాడనీ,ఆ క్రీస్తే మానవులను నియమించి, వారి ద్వారా ప్రజలను తనతో సఖ్యపరచుకుంటాడనీ వివరించబడి ఉంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN