ఆరోగ్యం అందరి హక్కు - పోప్
జోసెఫ్ అవినాష్
17 Feb 2026
యుద్ధాలు కేవలం దేశాల మధ్య ఘర్షణలు కావని,అవి నేరుగా మనిషి ప్రాణం మరియు ఆరోగ్య వ్యవస్థలపై దాడులని పోప్ అన్నారు. ఆసుపత్రులు ధ్వంసం కావడం అంటే మానవత్వంపైనే దెబ్బ అని ఆయన పేర్కొన్నారు.యుద్ధాలకు ఖర్చు చేసే ధనం ప్రజల ఆరోగ్య రక్షణకు వినియోగిస్తే ప్రపంచం మెరుగుపడుతుందని సూచించారు.ఆరోగ్యం అందరికీ హక్కు అయినా,ధనిక–పేదల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మనిషి ఆరోగ్యం పర్యావరణం,జీవన పరిస్థితులు,విద్య, ఉపాధితో అనుసంధానమై ఉందని గుర్తుచేశారు.ఈ సందేశాన్ని ఆయన
జగద్గురువుని పరిపాలన విభాగంలోని భాగమైన సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగం వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందించారు.
