మత స్వేచ్ఛను అణిచే చట్టాలు వెంటనే రద్దు చేయాలి

జోసెఫ్ అవినాష్
14 Feb 2026
అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య భారతదేశంలో అమలులో ఉన్న మత మార్పిడి వ్యతిరేక చట్టాలు మత స్వేచ్ఛను బలహీనపరుస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ చట్టాలను కొన్నిసార్లు నిరపరాధులపై కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని,ప్రతి వ్యక్తికి తన మనస్సాక్షి ప్రకారం విశ్వాసాన్ని ఎంచుకునే హక్కు ఉండాలని వారు స్పష్టం చేశారు.రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను రక్షించేందుకు ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేసి,ప్రజలు భయం లేకుండా తమ విశ్వాసాన్ని ఆచరించే వాతావరణం కల్పించాలని ఇటీవల జరిగిన అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య 37వ సర్వసభ్య సమావేశాలలో పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు.
