దైవాంకితులు ఒంటరి కారు - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్
27 Jun 2025
దైవాంకితులు ఒంటరికారని, వారితో ఎల్లవేళలా దేవుడు ఉంటారని జూన్ 25- 27 దైవాంకితుల జూబిలీ సందర్భంగా రోమ్ లో సమావేశమైన గురువులతో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకలు దాదాపు 1700 మంది దైవాంకితులు పాల్గొన్నారు. ముఖ్యంగా దైవాంకితుడికి ఉండాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాల గురించి ఆయన ప్రస్తావించారు. మొదటిది ఏసుక్రీస్తుతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి జీవిస్తూ, దైవ జ్ఞానంలో వర్ధిల్లాలని రెండవది గురువులు సోదర భావం కలిగి జీవిస్తూ, ఒకరినొకరు గౌరవించుకోవాలని, మూడవదిగా గురువులు ఎక్కువగా ఆలకించడం, ప్రేమించడం, సేవ చేయటం అలవాటు చేసుకోవాలని దేవుడు స్థాపించిన గురుత్వ వ్యవస్థ బలంగా ఉండాలంటే మంచి గురువులను ఎన్నుకోవాలని ఆ ఎన్నిక విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన సెలవిచ్చారు.