క్రీస్తు మనల్ని స్వస్థపరచగలడు- పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

25 Jun 2025

ఎటువంటి అనారోగ్య సమస్యతోనైనా విశ్వాసంతో ప్రభువు దగ్గరకు వెళితే ఆయన మనల్ని స్వస్థపరుస్తారని, స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తుప్రభువని జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ అన్నారు.మార్కు సువార్తలో రక్తస్రావము నుండి స్వస్థత పొందిన స్త్రీ స్వస్థత గురించి మరియు సమాజ మందిరపు అధికారి కుమార్తెను ప్రభువు మరణం నుండి సజీవముగా లేపిన అద్భుతం గురించి ప్రస్తావిస్తూ పోప్ తన సందేశాన్ని అందించారు. ఈ రెండు స్వస్థతలలో వారి వారి విశ్వాసాలే వారి స్వస్థతలకు కారణమయ్యాయని పోప్ అన్నారు. మనం విశ్వాసముతో ప్రభువు వైపుకు తిరిగినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుత స్వస్థతలు చవిచూడవచ్చునని పోప్ తెలియపరిచారు. బ్రతికించిన బాలికకు ఆహారం ఇవ్వమని ప్రభువు అన్నారని ఈ మాటలు క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, సమస్త మానవాళి పట్ల ఆయనకు గల ప్రేమను తెలియపరుస్తాయని పోప్ తెలియపరిచారు. మనం కూడా మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని మార్గంలో నడవాలని ఆయన కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN