పౌలు వలే మనం క్రీస్తును ప్రకటించాలి.

జోసెఫ్ అవినాష్

06 Jun 2025

పాస్కా 7వ శనివారం
అ.కా 28:16-20,30-31
కీర్తన 11:4,5-7
యోహాను 21:20-25
ధ్యానం:
ఈనాటి మొదటి పఠనంలో పు. పౌలు గారు సువిశేష బోధనయందు ఎంత ఆసక్తి గలిగి ఉన్నారో మనకు తెలియజేస్తుంది.ఆయన సంకెళ్లచె బాధింపబడియున్న, కారాగరమునందువున్న సువిశేషబోధన యందు మాత్రమే తన దృష్టిని కేంద్రికరించియున్నారు.కాని ఈనాటి సువిశేషంలో,పు, పేతురు గారు తన దృష్టిని ప్రభువుపై కేంద్రీకరించకుండా, ప్రక్కకు మళ్ళించడం గురించి మనం వింటువున్నాము. ప్రభువుతో మాట్లాడుతు, అంతలోనే, యేసుప్రభువు ప్రేమించిన శిష్యుని గురించి ప్రశ్నించడం మనం విన్నాము. పు. పేతురు గారి ప్రశ్నకు ప్రభువు సమాధానం, మన ఈనాటి ధ్యానాంశమునకు ఎంతో ముఖ్యము. “నేను వచ్చు వరకు అతడు ఉండుట, నాకు ఇష్టమైనచో, అది నీకేమి? నీవు నన్ను వెంబడింపుము" అని ప్రభువు పేతురుగారికీ జవాబు ఇస్తారు.ఆ సమాధానంలోని అంతరార్ధనం, నీ దృష్టిని ప్రక్క దారి మళ్ళించకుండా,నన్ను వెంబడించుటలో,సువిశేష బోధనలో కేంద్రికరించి జీవించు అని.కావున, ప్రభువు శిష్యులమైన మనం ఎల్లప్పుడు, మన దృష్టిని ప్రభువుపై కేంద్రిక, సువార్త ప్రబోధంలో ఎదుగుతు ప్రభువుకిష్టమైన జీవితం జీవించుదాం.

మానవజీవం దేవుని వరం. దైవరాజ్య నిర్మాణానికీ దేవుడు ఎవరిని,ఎప్పుడు పిలవలో ఆయనకు మాత్రమే తెలుసు. భూలోకములో మనం దేవునికి ఘనత,మహిమనే చేకూర్చాలి. ఇది మానవ భాద్యత.తనను అనుసరించు,ప్రకటించు వారిని దేవుడు ఆహ్వానించేవారు. పౌలు వలే మనం ఆయనను ప్రకటించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN