క్రీస్తు ప్రభువుని ప్రేమ పిలుపు ఈనాటికిని కొనసాగుతూవుంది

జోసెఫ్ అవినాష్
05 Jun 2025
పాస్కాకాలం,7వ శుక్రవారం
అ.కా 25:13-21
కీర్తన 103:1-2,11-12,19-20
యోహాను 21:15-19
ధ్యానం:
ఉత్థాన క్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చి,వారితో కలిసి భుజించిన పిదప పు. పేతురు గారిని మూడుసార్లు, "నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని ప్రశ్నించడం గురించి వినియున్నాము.ప్రభువు పేతురుగారిని బలవంతం చేయలేదు.కాని పేతురుగారే, స్వతంత్రముగా,ప్రభువుని ప్రేమిస్తున్నానని సమాధానమియ్యడం వినియున్నాము.ప్రభువుని ప్రేమించడం,ప్రభువుని అనుసరించడం,కష్టములతో, త్యాగాలతో,శ్రమలతో, హింసలతో కూడియున్నదని పేతురుగారికి ముందే తెలుసు. అన్ని తెలిసి కూడా ప్రభువుని ప్రేమించడానికి,ఆయన కొరకై పాటుబడడానికి సిద్ధమయ్యారు.ప్రభువుని ప్రేమించి,సువార్త వ్యాప్తికై పాటుబడ్డ శిష్యుడు పు. పౌలుగారు కారాగారంలో బందించబడడం,నిందారోపణ గావించబడడం గురించి ఈనాటి మొదటి పఠసంలో మనం వినియున్నాము.క్రీస్తు ప్రభువుని ప్రేమ పిలుపు ఈనాటికిని కొనసాగుతూవుంది.మరి మనం ఆయన పిలుపును అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నామా? అన్నింటి కంటే, అందరికంటే ఎక్కువగా ప్రభువు ప్రేమించడానికి అనుసరించడంలో ఎదురయ్యే పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడడానికి ప్రయాసపడుతున్నావు ?