శ్రీసభలోకి మరో 14 మంది పునీతులు, ప్రకటించిన పోప్
వాటికన్ వార్తా విభాగం
21 Oct 2024
నిన్నటి రోజున జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు క్రీస్తు కొరకు తమ ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా అర్పించిన 19వ శతాబ్దానికి చెందిన 14 మంది విశ్వాస వీరులను పునీతులుగా ప్రకటిస్తూ , వారి సుమాతృకను అనుసరిస్తూ, వారి మధ్యస్థ ప్రార్ధన వేడుదల ద్వారా క్రీస్తు బాటలో అడుగులు వేయాలని కతోలిక సమాజాన్ని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే 1860లో కొందరు ఉగ్రవాదులు తమ మతాన్ని విశ్వసించాలని, క్రైస్తవ మతాన్ని నిరాకరించాలని 14 మంది విశ్వాసులను కోరగా, వారు నిరాకరించటంతో వారి చేతులో క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని విడిచారు. ఈ 14 మందిలో గురువులు, కన్యా స్త్రీలు, గృహస్థవిశ్వాసులు చిన్న బిడ్డలు కూడా ఉన్నారు.