శ్రీసభ ధ్రువీకరించిన మరియమాత అద్భుతాలు
Editor
30 Jul 2024
అనేక సంఘాలలో, కుటుంబాలలో మరియతల్లి చేయు అద్భుతాలు కొన్నింటిని శ్రీసభ ధ్రువీకరించినవి స్మరించుదాం
1. పునీత బెర్నార్డ్ గారు(1091-1153)
ఈయనకు మరియతల్లి ఎడల అత్యంత భక్తి విశ్వాసములు కలవు.తన 19వ వేట తన తల్లి పరమాపదించగా మరియతల్లిని తన సొంత తల్లిగా అంగీకరించాడు. గాఢంగా ప్రేమించాడు. అప్పటినుండి తాను మరణించు వరకు మరియ తల్లి ఆయనను సంరక్షించింది. ఒకనాడు క్రీస్తు జన్మదిన అర్ధరాత్రి పూజలో బెత్లహేములో జన్మించిన శ్రీ బాలయేసుని దివ్య హస్తాలలో చూపించి ఇతడే లోకరక్షకుడని ఆ బాలుని స్వీకరించేందుకు ఆహ్వానించినట్లు ఒక దృశ్యాన్ని ఈ భక్తుడు చూసాడు. ఇది జపమాల ప్రార్ధన ద్వారా పొందుకున్న మహా అద్భుతం
2. భక్త డోమినిక్ గుజమన్(1170-1221)
రక్షణ చరిత్రలో మరియతల్లి పాత్రను శ్లాఘిస్తూ,జపమాల భక్తిని పెంపొందించుటకు ఎనలేని కృషి సల్పిన భక్తుడు ఇతడు ఈ కృషి ఫలితంగా 13వ శతాబ్దారంలో పతితులైన ఆల్ జీజియనులు తమ తప్పుడు సిద్ధాంతాలతో శ్రీసభకు అపార నష్టం కలిగించగా, ఈ భక్తుడు మరియతల్లి శరణు వేడి జపమాలను గొప్ప ఆయుధంగా వాడి, ప్రార్థించగా లక్షల మంది పతితులు మారుమనసు పొంది రక్షణ తనికి వచ్చారు..
3. ఫ్రాన్స్ దేశపు రాణి(1213)
ఆమెకు 12 సంవత్సరాల వరకు వివాహం అయిన తర్వాత సంతాన భాగ్యం లేక కుమిలిపోయింది. భక్తి దోమనిక్ ఆమెను దర్శించి, పట్టుదలతో జపమాలను ప్రార్థించమనగా 1213 సం"న ఫిలిప్పనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మరణించగా, పట్టువేడక అధైర్యపడక విశ్వాసంతో మరియతల్లికి తన రాజప్రస్థానంలోనున్న వారందరితో కూడి జపమాలను జపించగా, మరల 1215 వ సంవత్సరంలో లూయిస్కు జన్మనిచ్చింది. ఇతడే ఫ్రాన్స్ దేశం రాజుగా రాజ్యాన్ని వైభవోపేతంగా రాజులందరితో, ఆదర్శ ఏలికగా చారిత్రక ఖ్యాతిగాంచాడు
4.5వ భక్తనాధ జగద్గురువులు (1566-1572)
ఐరోపా దేశాలన్నీ మత సంస్కరణల వలన తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. దీనికి తోడుగా టర్కీ దేశపు సేనల దాడులు ఈ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనిని గమనించిన పాపు గారు విశ్వాసులందరూ జపమాల ప్రార్థన చేయమని ఆజ్ఞాపించరి. కొద్దిపాటి సైన్యమును సమీకరించి ప్రతి ఒక్క సైనికునికి ఒక జపమాలను ఇచ్చి పంపారు. సెప్టెంబర్ 8 1571సం"న కేవలం 3000 మంది ఐరోపా సైనికులు 30 వేల మంది టర్కీ సైన్యంపై లేపాంటో ప్రాంతంలో యుద్ధం చేసి, జయభేరీ మ్రోగించారు. ఇది జపమాల మాత అందించిన అద్వితీయమైన విజయమని జగద్గురువులు ప్రకటించారు.
5. హిరోషిమానగరంపై ఆటం బాంబుల వర్షం(1945)
ఆగస్టు 8 1945న హిరోషిమా నగరంపై ఆటంబాంబుల వర్షం ఫలితంగా ఆ చుట్టుప్రక్కల వాసులంతా ప్రాణాలు కోల్పోయిన అందులో ఒక గృహంలో నివసించు ఎనిమిది మంది యేసుసభకు చెందిన గురువులకు ఏ హాని కలుగలేదు. 2500 మంది శాస్త్రవేత్తలు ఈ ఘటనపై పరిశోధనలు చేసి ఎలా ప్రకటించారు. "ఇది ఒక అద్భుత ఘటన మానవమేధస్సుకు అదనది మానవతీతమైన శక్తి మమ్ములను గురువులను కాపాడింది" అని వెల్లడించేరి ప్రాణాలతో బయటపడిన ఆ ఎనిమిది మంది గురువులలో ఒకరు ఫాదర్ హెబర్ స్కిపిల్ గారు 1976లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన సత్ర్పసాద మహాసభల్లో "మేము ప్రాణాలతో బయటపడటానికి మరియమాత చేసిన సహాయమే మూల కారణం మేము ప్రతి దినం జపమాల ప్రార్ధన చేస్తాం కనుక ఆ దయగల తల్లి మమ్ము కరుణించి అకాల మరణం నుండి కాపాడింది" అని వెల్లడించారు.
6. మరియతల్లి అద్భుత దర్శనం:
పునీత ఫ్రాన్సిస్ గారి దినచర్య పుస్తకంలో ఒక యువ మఠవాసి గూర్చి వ్రాసిన సంఘటన ఆ మఠవాసి భోజనం ముందు జపమాలను జపించలేకపోవుటచే పీఠాధిపతి అనుమతి తీసుకొని తన గదిలోనికి వెళ్లి జపమాలను జపించాడు. చాలా సమయం అగుటచే భోజనానికి రమ్మని మఠాధిపతి మరొక మఠవాసిని పంపారు. వెళ్లి చూడగా ఆ గది అంతయు దేదివ్యమైన కాంతితో నిండి ఉన్నది. మరియతల్లి సాక్షాత్కరించారు.ఇద్దరు దూతలు ఇరువైపులా నిలిచి ఉన్నారు.ఆ మఠవాసి చెప్పిన ప్రతి మంగళవార్త జపంలో ఒక అందమైన గులాబీ పుష్పం తన నోటి నుండి వెలువడగా వాటిని మరియతల్లి శిరస్సుపై అలంకరిస్తున్నారు. అ దృశ్యాన్ని చూచి తను కూడా అక్కడే ఉండిపోయారు. ఇద్దరు మఠవాసులు ఆ దివ్య దర్శనమును గాంచి నిశ్చేఘ్టులయ్యారు.
7. వాసుగోడిగామా- జపమాల భక్తి
1498 సం"లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత తాము ప్రయాణించుటకు జపమాల ప్రార్థించాడు. ఓడ ముందు భాగంలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించాడు. ఆ తల్లి సహాయంతో సకల ఆపదలనుండి సముద్రపు విపత్తుల నుండి రక్షించబడమని ఆయన అచంచల విశ్వాసాన్ని వెల్లడించాడు.
8. పోర్చుగీసు వారు వేలాంగని చేరిక-:
ఒక ఓడ చైనాలోని మరొక రేవు నుండి పోర్చుగల్ దేశానికి బయలుదేరింది. దురదృష్టవశాత్తు భయంకర తుఫానులో చిక్కుకున్నది. అందులోని వర్తకులందరూ తమను కాపాడమని మరియ తల్లిని వేడుకొన్నిరి వారి మోర ఆలకించిన మరియతల్లి తన అద్భుత శక్తితో వారిని నేటి వేళంగాని పుణ్యక్షేత్రం గల సముద్ర తీరానికి సురక్షితంగా చేర్చారు. దేవుని ప్రేమను ప్రదర్శించుటకు ఈ పవిత్ర స్థలాన్ని ఆ తల్లి ముందుగానే ఎన్నుకొన్నారు. కృతజ్ఞతగా పోర్చుగీసు వర్తకులు 24 అడుగుల చుట్టుకొలత 12 అడుగుల ఎత్తు గల దేవాలయాన్ని నిర్మించారు. వారు తిరిగి ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడల్లా ఆ గుడిని వివిధ అలంకరణలతో తీర్చిదిద్దేవారు. నేడు అక్కడున్న మరియతల్లి స్వరూపం వారు ప్రతిష్టించినదే.
9. పునీత ఇగ్నేషియాస్(1491-1556)
యేసు సభను స్థాపించిన పునీత ఇన్యాసి వారు మొదట సైన్యంలో రాజు కొలువులో ఉండేవారు. కానీ దేవమాత యెడల తనకున్న భక్తి గౌరవ విశ్వాసాలు మూలంగా తనకు తన సంపూర్ణంగా ప్రభువు సేవకు అర్పించుకున్నారు. ఒకనాడు రాత్రి మరియ తల్లి తన దివ్య హస్తాలతో బాల యేసుని ఎత్తుకొని ఇన్యాసి గారికి దర్శనం ఇచ్చారు. మరియతల్లి మహిమ ప్రభావాలను కల్లారా చూచి ఆయన ఈ లోక సుఖ భోగాలను తెగించి భక్తి జీవనంలోనే ఆనందం ఉందని గ్రహించారు .అప్పటినుండి రాజ కొలువును విడనాడి పవిత్ర జీవితం గడుపుతూ యేసు సభను స్థాపించారు. అనేక వేదాంత గ్రంథాలను రాశారు. సంఘసంస్కరణకు దోహదపడ్డారు. జపమాల మహిమను పొందారు.
10. ఫాతిమా నగరంలో మరియతల్లి దర్శనం(1917)
అక్టోబర్ 13 1917న మరియ తల్లి చివరి దర్శనంలో లూసీ, ఫ్రాన్సిస్, జెసింతలకు కమ్యూనిస్టు దేశమైనా రష్యా పరివర్తన కోసం, ప్రపంచ శాంతి కోసం జపమాల ప్రార్థన చేయమని హెచ్చరించారు. లూసీకి బదులిస్తూ "నేను జపమాల రాణిని విశ్వాసులను హెచ్చరించడానికి వచ్చాను. పాపులు మారుమనసు పొందాలి, పాపక్షమాపణ అడగాలి. ప్రభువు హృదయం తీవ్రంగా గాయపడింది. ఇంకా ప్రభువును బాధ పెట్టకూడదు. అందరూ జపమాల ప్రార్ధన చేయాలని తన దర్శనంలో సూచించారు". 6వ పౌలు జగద్గురువులు జపమాల భక్తుని ప్రోత్సహించారు. భక్తుల అనేక అద్భుతాలను పొందుకుంటేనే ఉన్నారు.
11.లూర్ధునగరంలో మరియమాత దర్శనం(1858)
ఫ్రాన్స్ దేశంలోని లూర్ధు పట్టణంలో గల ఒక కొండ గుహలో బెర్నదత్తకు ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు 18 సార్లు దర్శనమిచ్చి పాపాత్ముల కొరకు ప్రార్థించు ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి అని తాను జన్మ పాపా రహితోద్భవి అని కనబరుచుకున్నారు. అక్కడ ఒక నీటి బుగ్గ ద్వారా తల్లిని వేడిన భక్తులు అనేక స్వస్థతలు, అద్భుత కార్యాలు కోకలలుగా జరుగుతూనే ఉన్నవి. జపమాలలోని శక్తి అనేకులు చవిచూస్తూనే ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలలో వెలసిన గుణదల మాత, విశాఖపురిమాత, సాగరమాత, నిర్మలగిరిమాత, కోడూరు మాత పుణ్యక్షేత్రాలు మరియతల్లి విజ్ఞాపన ప్రార్ధన ద్వారా అనేక స్వస్థతలు మూలంగా వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రాలు వ్యక్తిగతంగా కుటుంబ సంఘ పరంగా అనేక మహత్కార్యాలు జరుగుచున్నవి. వాటన్నిటిని శ్రీ సభ ద్రువీకరించకపోయినను మరియతల్లి మహత్యం దేవుని మహిమార్థం జరుగుతూనే ఉన్నవి..