నేటి సువిశేష సందేశం పద్య రూపంలో
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
29 Jul 2024
తే.గీ.
యేసుగురుగులవుపమానమెరుక పరచె!
విత్త నంబును విత్తును
మనుజ కొమరు!
పొలము లోకమనబడును
పాలనమున!
మంచివిత్తులు రాజ్యపు
మంచివారు!
గురుగు లన్నియు దుష్టుని
గురుతుయగును!
తేగీ
గురుగు లనువిత్తు శత్రువు
పరగ దుష్టు!
కోత సూచించు అంతము,
కోరి చూడ!
కోత కోసెడివారంత దూతగణము!
అంతమందున దుష్టుల
నగ్నికాల్చు !
నీతిమంతులు పరమున
నిలిచి యుందురు!